Friday, May 3, 2024

Crime: చికెన్ బండి వ్యాపారిపై కత్తులతో దాడి

క‌ర్నూలు జిల్లా నంద్యాలలోని సంజీవనగర్‌లో చికెన్ బండి వ్యాపారిపై దుండగులు కత్తులు, రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో హిమాన్స్ అనే వ్యాపారి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని వ్యాపారిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హిమాన్స్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కుటుంబకలహాలే దాడికి కారణమని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement