Tuesday, May 7, 2024

Breaking: హైదరాబాద్​ జింకలవాడ బస్తీలో దారుణం.. ర్యాష్​ డ్రైవింగ్​, చిన్నారిపై కారు ఎక్కించి యువకులు

హైదరాబాద్​ సనత్​నగర్​ జింకలవాడ బస్తీలో దారుణం జరిగింది. ఇవ్వాల (ఆదివారం) సాయంత్రం కొంతమంది యువకులు కారులో వస్తున్నారు. అయితే ఆకస్మాత్తుగా కారు అదుపుతప్పడంతో అది ఎదురుగా ఉన్న ఓ రెండేళ్ల బాలికపైకి దూసుకెళ్లింది. అట్లానే డ్రైవ్​ చేయడంతో బాలిక అక్కడికక్కడే చనిపోయింది. రెండేళ్ల బాలికపైకి కారును ఎక్కించేసి తొక్కి చంపేశారు యువకులు. వారి ర్యాష్​ డ్రైవింగ్​ వల్లనే ఈ దారుణం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదం తర్వాత కారును అక్కడే వదిలేసి ఆ యువకులు పరారయ్యారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement