Thursday, May 2, 2024

గన్స్​, మిస్సైల్స్​, డ్రోన్లు కావాలే.. ఇండియన్​ డిఫెన్స్​ ఇండస్ట్రీకి ఆర్మీ కొనుగోలు ఆర్డర్స్​

“భవిష్యత్తులో జరిగే యుద్ధాలను స్వదేశంల తయారైన ఆయుధాలతోనే పోరాడాలనే” లక్ష్యానికి అనుగుణంగా అత్యవసర సేకరణ కోసం కీలకమైన రక్షణ పరికరాలను అందించాల్సిందిగా దేశీయ రక్షణ పరిశ్రమను ఆహ్వానించినట్లు భారత సైన్యం తెలిపింది. వరుస ట్వీట్లలో ఈ  ప్రతిపాదనల కోసం అభ్యర్థనల (RFPలు) వివరాలను పొందడానికి లింక్‌లను కూడా షేర్ చేసింది.  ఈ ప్రక్రియ “కంప్రెస్డ్ టైమ్‌లైన్స్‌ పై ఆధారపడి ఉంటుంది.

ఇందులో సేకరణ విండో ఆరు నెలల పాటు భారతీయ పరిశ్రమకు తెరిచి ఉంటుంది. ఒప్పందంపై సంతకం చేసిన ఒక సంవత్సరంలో పరిశ్రమ పరికరాలను డెలివరీ చేస్తుందని భావిస్తున్నారు” అని ట్వీట్​లో పేర్కొన్నారు.  సేకరణ అనేది “ఓపెన్ టెండర్ ఎంక్వైరీ”పై ఆధారపడి ఉండబోతోంది అని మైక్రోబ్లాగింగ్ సైట్‌లో రాశారు. తుపాకులు, క్షిపణులు, డ్రోన్లు, కౌంటర్ డ్రోన్, లొయిటర్ మ్యూనిషన్, కమ్యూనికేషన్ & ఆప్టికల్ సిస్టమ్స్, స్పెషలిస్ట్ వెహికల్స్, ఇంజినీరింగ్ ఎక్విప్‌మెంట్ & ఆల్టర్నేట్ ఎనర్జీ రిసోర్సెస్ కోసం ప్రతిపాదనలు ఉంటాయని మరో ట్వీట్‌లో రక్షణ శాఖ పేర్కొంది.

ఇక.. మరో డెవలప్‌మెంట్‌లో  లేహ్‌కు చెందిన ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్, “#ఇండియన్ ఆర్మీ “ఆల్వేస్ త్రూ” అని ట్వీట్ చేసింది. సియాచిన్ సిగ్నలర్స్ ద్వారా ప్రపంచంలోని అత్యంత ఎత్తైన యుద్దభూమి అయిన #సియాచెన్ గ్లేసియర్‌లో 19,061 అడుగుల ఎత్తులో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సర్వీస్ యాక్టివేట్ అయ్యింది.” భారత సైన్యం తన వివిధ అవసరాలను తీర్చడానికి అనేక స్వదేశీ పరిజ్ఞానంపై దృష్టి సారించింది. ఇది ఇటీవల లాజిస్టిక్స్‌ పై ఒక సెమినార్‌ను నిర్వహించింది.  వ్యవస్థను స్వయం-ఆధారితంగా మార్చడానికి మార్గాలను చర్చించింది. ‘‘భవిష్యత్తులో ఎదురయ్యే భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు పటిష్టమైన, సురక్షితమైన, వేగవంతమైన.. ‘ఆత్మనిర్భర్’ లాజిస్టిక్స్ వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్  అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement