Friday, April 26, 2024

Technology: చిప్స్ టు స్టార్టప్ (C2S) ప్రోగ్రామ్‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతున్న కేంద్రం

టెక్నాల‌జీలో యుత్‌ని ప్రోత్స‌హించేలా కేంద్ర కొత్త కొత్త ప‌థ‌కాల‌ను తీసుకొస్తోంది. ఇందులో బాగంగా చిప్ప్ టు స్టార్ట‌ప్ ప్రోగ్రామ్‌ని ప్ర‌వేశ‌పెట్టింది. దీనికి ప‌లు విద్యాసంస్థ‌లు, రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ సంస్థ‌ల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను కోరుతోంది. ఈ నెలాఖరులో దరఖాస్తులు చేసుకోవాలని ఔత్సాహికులకు పిలుపునిచ్చింది.

చిప్స్ టు స్టార్టప్ (C2S) ప్రోగ్రామ్ కింద 100 విద్యాసంస్థలు, రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్‌ సంస్థలు, స్టార్టప్‌లు, MSMEల నుండి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (MeitY) దరఖాస్తులను కోరుతోంది. ఈ కార్యక్రమం ద్వారా 85,000 మంది అధిక నాణ్యత, అర్హత కలిగిన ఇంజనీర్‌లకు చాలా పెద్దస్థాయి ఇంటిగ్రేషన్ (VLSI), ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్‌లో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.

దీనికి 5 సంవత్సరాల పాటు 175 ASICలు (అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌లు), 20 సిస్టమ్ ఆన్ చిప్ (SoC) యొక్క వర్కింగ్ ప్రోటోటైప్‌ను అభివృద్ధి చేయడం ఈ కార్య‌క్ర‌మం ఉద్దేశం. నోడ‌ల్ ఏజెన్సీ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC) ద్వారా కేంద్ర ప్ర‌భుత్వం ఈ ప్రాజెక్టును చేప‌డుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement