Monday, April 29, 2024

RRR కేసు విషయంలో కోర్టు ధిక్కరణ కింద నోటీసులు ఇవ్వాలని ఆదేశం

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మెజిస్ట్రేట్ కోర్టు ఆర్డర్స్‌ను రద్దుచేయాలని ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిలో భాగంగా హైకోర్టు, మెజిస్ట్రేట్ ఉత్తర్వులను ఎందుకు అమలుచేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మధ్యాహ్నం 12 గంటలకు వైద్య నివేదిక ఇవ్వాలని చెప్పినా సాయంత్రం 6 గంటల వరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. రా.11 గంటలకు ఆర్డర్ కాపీ ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదంది. ప్రభుత్వంపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కింద నోటీసులివ్వాలని ఆదేశించింది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే కోర్టులు స్పందిస్తాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ అంశానికి సంబంధించి సీఐడీ అదనపు డీజీ, ఎస్‌హెచ్‌వోకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement