Monday, April 29, 2024

అమర జవాన్‌ కుటుంబాన్ని రూ.50 లక్షల ఆర్థిక సహాయం

ఉగ్రవాదులపై పోరులో భాగంగా కశ్మీర్‌లో ప్రాణత్యాగంచేసిన గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెంకు చెందిన జవాను జశ్వంత్‌రెడ్డి చిరస్మరణీయుడని సీఎం వైయస్‌.జగన్‌ వ్యాఖ్యానించారు. దేశ రక్షణలో భాగంగా కశ్మీర్‌లో తన ప్రాణాలు పణంగాపెట్టి పోరాటంచేశారని, జశ్వంత్‌రెడ్డి త్యాగం నిరుపమానమైనది అన్నారు. మన జవాన్‌ చూపిన అసమాన ధైర్యసాహసాలకు ప్రజలంతా గర్విస్తున్నారన్నాంటూ నివాళులు అర్పించారు. ఈ కష్టకాలంలో జశ్వంత్‌రెడ్డి కుటుంబానికి తోడుగా నిలవాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. జశ్వంత్‌రెడ్డి సేవలు వెలకట్టలేనివని, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి సమాచారం తెలియగానే.. ఈ విధంగా స్పందించారు.

కాగా, జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లాకు జవాను మరుపోలు జశ్వంత్‌రెడ్డి మృతి చెందారు. గురువారం రాజౌరి జిల్లా సుందర్బనీ సెక్టార్‌లో ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అందులో జస్వంత్​ రెడ్డితో పాటు మరో భారత జవాన్ వీరమరణం పొందారు. ఈ ఘటనతో జవాన్ జస్వంత్​ సొంతూరు బాపట్ల మండలం దరివాద కొత్తవాసి పాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇది కూడా చదవండి: టీ.టీడీపీకి ఎల్‌.రమణ రాజీనామా

Advertisement

తాజా వార్తలు

Advertisement