Saturday, April 27, 2024

ఏపీలో కొత్తగా కరోనా కేసులు ఎన్నంటే..

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,925 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్‌ ప్రభావంతో 26 మంది మృతి చెందారు. అందే సమయంలో 3,937 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 18,75,035 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 29,262 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ మహమ్మారి బారినపడి మొత్తం 12,986 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,28,94,611 టెస్టులు నిర్వహించారు. కాగా, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు మృతి చెందారు. అలాగే కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, కడప, ప్రకాశం, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు. 

ఇది కూడా చదవండి: ఏపీతోనే కాదు.. దేవుడితోనూ కొట్లాడతాం : కేటీఆర్

Advertisement

తాజా వార్తలు

Advertisement