Monday, April 29, 2024

ఏపీ అసెంబ్లీలో గంద‌ర‌గోళం – న‌లుగురు టీడీపీ సభ్యులపై స‌స్పెన్ష‌న్ వేటు

నేటి ఏపీ అసెంబ్లీ స‌భ ప్రారంభం కాగానే స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం ప్ర‌శ్నోత్త‌రాల‌ను చేప‌ట్టారు. కాగా టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళ‌న చేప‌ట్ట‌డంతో న‌లుగురు పార్టీ స‌భ్యుల‌ను స‌భ నుంచి స‌స్పెండ్ చేశారు. ఈ స‌మావేశాలు నిర‌వ‌ధిక వాయిదా ప‌డే వ‌ర‌కు (ఈ నెల 25 వ‌ర‌కు) వారిపై స‌స్పెన్ష‌న్ కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. స‌స్పెన్షన్ వేటు ప‌డిన వారిలో అశోక్‌, రామ‌రాజు, స‌త్య‌ప్ర‌సాద్, రామ‌కృష్ణ ఉన్నారు. కాగా, నేడు బడ్జెట్ కేటాయింపులపై నాలుగో రోజు చర్చ జరుగనుంది. పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై ఉభయ సభల్లో స్వల్ప కాలిక చర్చ జ‌ర‌గాల్సి ఉంది. ప్ర‌స్తుతం ఏపీ ఫైబ‌ర్ గ్రిడ్ ప్రాజెక్టుపై అసెంబ్లీలో ప్ర‌స్తుతం చ‌ర్చ జ‌రుగుతోంది. ఏపీ ఫైబ‌ర్ గ్రిడ్ ప్రాజెక్టు పెద్ద కుంభ‌కోణ‌మ‌ని మ‌ద్దిశెట్టి వేణు గోపాల్ ఆరోపించారు. అర్హ‌త‌లేని కంపెనీల‌కు టెండ‌ర్లు క‌ట్ట‌బెట్టి భారీగా అవ‌క‌త‌వ‌క‌లకు పాల్ప‌డ్డార‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement