Friday, April 26, 2024

ప్రధాని మోదీకి బహుమతి ఇచ్చిన బాలీవుడ్ నటుడు

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా అనుపమ్ ఖేర్ ప్ర‌ధానికి ఓ బ‌హుమ‌తి ఇచ్చారు. త‌న త‌ల్లి ఇచ్చిన రుద్రాక్ష మాల‌ను ప్ర‌ధానికి అనుమ్ ఖేర్ అంద‌జేశారు. దేశం కోసం ప్రధాని చేసిన కృషిని ప్రశంసిస్తూ సోషల్ మీడియా పోస్ట్‌ను పంచుకున్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని క‌లుసుకోవ‌డం ఎంతో గ‌ర్వంగా ఫీల‌వుతున్నాను అని ఆయన అన్నారు. దేశం కోసం రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతున్న తీరు చూస్తే ఎంతో ప్రేర‌ణ‌నిస్తోందని చెప్పారు. మిమ్మ‌ల్ని స‌దా ర‌క్షించ‌డానికి మా అమ్మ మీకు ఓ రుద్రాక్ష మాల‌ను బ‌హూక‌రించానని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కాగా, ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాలో అనుమప్ కీలక పాత్రలో నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement