Monday, April 29, 2024

టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ఎక్స్ అఫిషియో స‌భ్యుడిగా – అనిల్ కుమార్ సింఘాల్‌

టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ఎక్స్ అఫిషియో స‌భ్యుడిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు అనిల్ కుమార్ సింఘాల్.. తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. టీటీడీ అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి వీరి చేత ప్రమాణం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. ఆ తరువాత అదనపు ఈవో స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్ అందించారు. ఈ కార్యక్రమంలో జేఈవో సదా భార్గవి, డిప్యూటీ ఈవోలు రమేశ్‌ బాబు, కస్తూరిబాయి అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement