Thursday, May 2, 2024

Big Breaking | ఇల్లు ఖాళీ చేయించిందనే కోపం.. పాపతో సహా ఇంటి ఓనర్​ దారుణ హత్య

రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. కిరాయికి ఉన్న ఇంటినుంచి ఖాళీ చేయించారనే కోపంతో ఓ జంట ఆ ఇంటి ఓనర్​ని, మరో పాపను దారుణంగా చంపేసిన ఘటన షాద్​నగర్​లో చోటుచేసుకుంది.​ నియోజకవర్గంలోని నందిగామలో ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగినట్టు తెలుస్తోంది. కాగా, తొమ్మిదేండ్ల బాలిక సహా వృద్ధురాలిని దారుణంగా చంపేశారు దుండగులు.

నెల రోజుల క్రితం నందిగామలోని పార్వతమ్మ ఇంట్లో ఓ జంట రెంట్​కు దిగింది. అయితే.. తమను ఇల్లు ఖాళీ చేయించిందనే కక్షతో మర్డర్​కి ప్లాన్​ చేశారు ఇద్దరు భార్యభర్తలు. పార్వతమ్మ నిద్రిస్తున్న సమయంలో ఆమెతో పాటు ఆమె ఇంట్లో ఉన్న పాపను గొంతుకోసం హత్యచేశారు. అంతేకాకుండా బీరువా పగలగొట్టి నగదు, బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ దారుణానికి పాల్పడ్డ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. నిందితులు దివాకర్​, అంజలిగా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement