Thursday, April 25, 2024

నేడే ఓర్వకల్లు విమానాశ్రయం ప్రారంభం

కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నిర్మించిన విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు గురువారం నాడు సీఎం జగన్ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఉదయం 11:45 గంటలకు విమానాశ్రయానికి చేరుకునే జగన్ తొలుత జాతీయ జెండాను, ఆ తర్వాత వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12:18 గంటలకు విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మరో కార్యక్రమంలో 12:22 గంటలకు ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను ఆవిష్కరిస్తారు. ఈ నెల 28 నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరుకు కర్నూలు నుంచి ఇండిగో ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులు ప్రారంభించనుంది. కాగా ఈ విమానాశ్రయాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement