Thursday, April 18, 2024

భారీ నష్టాలతో ప్రారంభమయిన మార్కెట్లు

ఇండియాలో కరోనా కేసుల పెరుగుదల మళ్లీ అన్నిరంగాలను కుదిపేస్తోంది. స్టాక్ మార్కెట్లు సైతం ఇందుకు మినహాయింపు కాదు. దేశవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య ఒక్క రోజులోనే 50 వేలకు పైగా దాటడం, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పై ప్రభావం చూపింది. తొలుత నామమాత్రపు లాభాలతో ప్రారంభమైన సూచీలు, ఆ వెంటనే ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన అమ్మకాల ఒత్తిడితో భారీ నష్టాల దిశగా సాగుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్ తీవ్ర ఒత్తిడితో ఉంది. దాదాపు అన్ని బ్యాంకుల ఈక్విటీ షేర్లూ పడిపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీలు పాయింట్లు పడిపోయాయి. సెన్సెక్స్ 464 పాయింట్లు, నిఫ్టీ 131 పాయింట్లు నష్టపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement