Monday, May 6, 2024

రూ.254 కోట్లు విడుదల చేసిన జగన్ సర్కారు

ప్రమాదాల కారణంగా ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాలకు ఆసరా ఉండేందుకు ఏపీలో ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ బీమా పథకానికి సీఎం వైఎస్ జగన్ నిధులు విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. ఈ మేరకు 2020 అక్టోబర్‌ 21న పథకం ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఈ తరహాలో మరణించిన 12,039 మంది వ్యక్తుల కుటుంబ సభ్యులకు రూ. 254 కోట్లు చెల్లించనున్నారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో స్థానిక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

సహజ మరణానికి రూ.2 లక్షలు, ప్రమాద మరణం, శాశ్వత అంగవైకల్యానికి రూ.5 లక్షలు(18-50 వయస్సు), రూ.3లక్షలు (51-70 వయస్సు) బీమా… అలాగే పాక్షిక శాశ్వత అంగవైకల్యానికి రూ.1.5 లక్షల బీమాను అధికారులు అందించనున్నారు. అర్హత ఉన్నా బ్యాంకుల్లో పేర్లు నమోదు కాని కుటుంబాలకు కూడా అండగా ఉంటున్నామని సీఎం జగన్ అన్నారు. ప్రతి ఏడాది రూ.510 కోట్లతో 1.41 కోట్ల కుటుంబాలకు ఉచిత బీమా ఇస్తున్నామని తెలిపారు. కేంద్రం సాయం లేకున్నా బీమా ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోందని పేర్కొన్నారు. గతంలో ఉండే గ్రూప్ ఇన్సూరెన్స్‌ను కూడా తొలగించారని, వ్యక్తిగతంగా అకౌంట్‌ ఉన్న వారికే బీమా సౌకర్యం కల్పించారన్నారు. వాలంటీర్ల ద్వారా కొత్తగా 61 లక్షల మంది అకౌంట్‌లను ప్రారంభించామన్న సీఎం జగన్.. ఆ కుటుంబాలకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చిందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement