Friday, May 3, 2024

మ‌రోసారి పెరిగిన.. అమూల్ పాల ధ‌ర‌లు

మ‌రోసారి అమూల్ పాల‌ధ‌ర‌లు పెరిగాయి.. లీట‌రుపై రూ.3పెంచిన‌ట్లు గుజ‌రాత్ డెయిరీ వెల్ల‌డించింది. అమూల్ గోల్డ్ పాలు లీటరు రూ. 66, అమూల్ తాజా పాలు లీటరు రూ.54, అమూల్ ఆవు పాలు లీటరుపై రూ.56 చెల్లించాల్సి ఉంటుంది. ఇక అమూల్ ఏ2 గేదె పాల ధర లీటరు రూ.70కు పెంచుతూ అమూల్ డెయిరీ నిర్ణయం తీసుకుంది.శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా పెరిగిన అమూల్ పాల ధరల జాబితాను గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ సేల్స్ సీనియర్ మేనేజర్ ప్రకాష్ ఔటే విడుదల చేశారు. కాగా, గతంలో అమూల్ 2022లో పాల ధరను మూడుసార్లు పెంచిన విషయం తెలిసిందే. గతేడాది మార్చి, ఆగస్టు, అక్టోబర్‌లలో పాలధరను పెంచింది. పెరుగుతున్న ధరల దృష్ట్యా పాల ధరను పెంచినట్లు కంపెనీ తెలిపింది. గతంలో సాధారణంగా లీటరుకు రూ.2 పెంచగా.. ఈసారి ఏకంగా మూడు రూపాయలు పెంచ‌డం గ‌మ‌నార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement