Sunday, April 28, 2024

అంబేద్క‌ర్ ఆశయ స్ఫూర్తిగా కెసిఆర్ పాలన – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.అర్ అంబేడ్కర్ 131వ జయంతి పురస్కరించుకుని జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో అయన విగ్రహానికి రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఆయన సేవలు స్మరించుకున్నారు.అంబేడ్కర్ ఆశయాలు సాధిస్తామని నినాదాలు చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డా.బాబా సాహెబ్ అంబేద్కర్ అణగారిన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడని మంత్రి ఈ సందర్భంగా ఆయన సేవలు కొనియాడారు.ఆయన ఆశయాల స్ఫూర్తి తోనే కెసిఆర్ ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళితులు ఆర్దికంగా ఉన్నతస్థాయిలో ఎదగాలని దళితబంధు లాంటి విప్లవాత్మకమైన కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ చేపట్టారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement