Monday, April 29, 2024

టాటా చేతికి ఎయిర్ ఇండియా.. నేడే అప్పగింత

ఎయిర్‌ ఇండియా మళ్లీ టాటాల సొంతం కాబోతోంది. 69 ఏళ్ల తరువాత నేడు అధికారికంగా టాటాలకు ఎయిర్‌ ఇండియా సంస్థను కేంద్ర ప్రభుత్వం అప్పగించబోతోంది. ఈ మేరకు అన్ని లాంఛనాలను పూర్తి చేసింది. అప్పుల ఊబిలో చిక్కుకున్న ఎయిర్ ఇండియాలో 100 శాతం వాటా విక్రయానికి ప్రభుత్వం 2021లో బిడ్డింగ్‌ నిర్వహించింది. టాటా అనుబంధ సంస్థ టాలెస్‌ ప్రయివేటు లిటిమెటడ్‌ రూ. 18 వేల కోట్లకు ఎయిర్‌ ఇండియాను దక్కించుకుంది. 2021 అక్టోబరు 8న టాటాతో విక్రయ ఒప్పందానికి ఆమోదం లభించింది. అక్టోబరు 25న విక్రయ ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం సంతకం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement