Tuesday, May 21, 2024

ఎయిడ్స్ ప్రాణాంత‌క వ్యాధి కాదు .. మంత్రి హ‌రీశ్ రావు ..

నేడు ఎయిడ్స్ డే..ఈ సంద‌ర్భంగా ఎయిడ్స్ రోగుల‌కు ఉచిత డ‌యాల‌సిస్ కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తామ‌ని మంత్రి హ‌రీశ్ రావు వెల్ల‌డించారు. ఎయిడ్స్ మ‌ర‌ణాల‌ను త‌గ్గించ‌డ‌మే ప్ర‌భుత్వ లక్ష్య‌మ‌ని చెప్పారు. ఎయిడ్స్‌ డే సందర్భంగా ఎర్రగడ్డ ఛాతీ దవాఖానలో జరిగిన అవగాహన కార్యక్రమంలో మంత్రి హ‌రీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఎయిడ్స్‌ ప్రాణాంతక వ్యాధి కాదని చెప్పారు. వ్యాధి నివారణపై ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాలన్నారు. ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులను చిన్నచూపు చూడటం తగదన్నారు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement