Thursday, May 9, 2024

భట్టికి మాణిక్యం ఠాగూర్ ఫోన్.. పాదయాత్రకు ఎఐసిసి సంపూర్ణ సహకారం

ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. విషయాన్ని తెలుసుకున్న ఏఐసీసీ అధినేత్రి సోనియా, అధినేత రాహుల్  హర్షం వ్యక్తం చేశారని ఢిల్లీ నుంచి ఏఐసిసి జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జీ మాణిఖ్యం ఠాగూర్ బుధవారం రాత్రి భట్టి విక్రమార్కకి ఫోన్ చేసి తెలిపారు. ఈ పాదయాత్ర మధిర నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని భట్టి విక్రమార్క చేసే పాదయాత్రకు అధిష్టానం నుంచి సంపూర్ణమైన మద్దతు ఉంటుందని వారు తెలిపారని మాణిక్యం ఠాగూర్ భట్టి విక్రమార్కకి ఫోన్ లో చెప్పారు. మధిర నియోజకవర్గం చింతకాని మండలం రేపల్లెవాడలో పాదయాత్ర  సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతున్న సమయంలో ఠాగూర్ ఫోన్ చేసి మాట్లాడారు. ఇదే క్రమంలో ఫోన్ ద్వారా గ్రామ ప్రజలకు మాణిక్యం ఠాగూర్, రాహుల్ గాంధీ పంపిన సందేశాన్ని వివరించారు.

కేంద్రంలోని మోడీ సర్కార్ డీజిల్, పెట్రోల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్వహించే ఆందోళన కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులుతో పాటు ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ మండుటెండను సైతం లెక్కచేయకుండా ప్రజా సమస్యల పరిష్కారం కొరకు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర పై  అధినేత రాహుల్ గాంధీ తెలుసుకొని అభినందించారని వెల్లడించారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో తెలంగాణ లో 2023 లో కాంగ్రెస్ ప్రభుత్వం రానున్నదని తెలిపారు. రానున్న రోజుల్లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మీద పోరాటం ఉదృతం చేయాలన్నారు. భట్టి విక్రమార్క అత్యంత మిత్రుడని తన అనుబంధాన్ని ఈసందర్భంగా గుర్తు చేశారు.భట్టితో కలిసి నడుస్తున్న కాంగ్రెస్ శ్రేణులకు, ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జైరాహుల్…జై సోనియమ్మ నినాదాలతో కాంగ్రెస్ కార్యకర్తలు హోరెత్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement