Sunday, May 5, 2024

ఏరో ఇండియా 2023షోని ప్రారంభించిన.. ప్ర‌ధాని మోడీ

ఏరో ఇండియా 2023షోని ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. బెెంగళూరులో ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన మొదలైంది.భారతీయ, విదేశీ రక్షణ రంగ సంస్థలు ఈ ప్రదర్శనలో.. భారీ ప్రదర్శనకారుల విభాగంలో తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. యలహంక వైమానిక శిక్షణ క్షేత్రంలో 14వ ఏరో ఇండియా 2023 ప్రారంభ‌మైంది. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శన ఎన్నో అవకాశాలకు రన్‌వేగా నిలుస్తుందని మోడీ చెప్పారు. ఈ ఎయిర్‌షోలో భాగంగా భారత్‌, విదేశీ రక్షణ కంపెనీల మధ్య రూ.75వేల కోట్ల విలువైన 251 ఒప్పందాలు జరగనున్నట్లు రాజ్‌నాథ్‌ సింగ్ తెలిపారు. ద రన్‌ వే టు ఏ బిలియన్‌ ఆపర్చునిటీస్ పేరిట నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన నేటి నుంచి ఐదు రోజుల పాటు జరగనుంది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 98 దేశాలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. 809 రక్షణ, వైమానిక రంగ ప్రదర్శనకారులు తమ విన్యాసాలను ప్రదర్శించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement