పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మీద ఉన్న అభిమానం తన ప్రత్యేకతను చాటుకునేలా చేసింది. మొన్న జరిగిన పవన్ కల్యాణ్ బర్త్ సందర్భంగా చిత్తు పేపర్లతో అతిపెద్ద హోర్డింగ్లా ఆర్ట్ వేశాడో కుర్రాడు. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్లో మాస్టర్స్ ఆప్ కమ్యూనికేషన్ డిజైన్ కంప్లీట్ చేసిన ఇగురపు మోహన్రావు ప్రతిభను ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇట్లాంటి ఆర్ట్ నేర్చుకున్నట్టు తెలిపాడు. ఈ ఆర్ట్ వర్క్ చూసిన పవన్ కల్యాణ్ కూడా అతడిని అభినందించినట్టు తెలుస్తోంది.
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2022/09/20220902_124849-1024x461.jpg)