Thursday, April 25, 2024

గ్రీన్ఇండియా చాలెంజ్: మొక్కలు నాటిన నటి నందిత శ్వేత

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో సినీ నటి నందిత శ్వేత పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా తన పుట్టినరోజు పురస్కరించుకుని జూబ్లీహిల్స్ GHMC పార్క్ లో నందిత శ్వేత మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నందిత శ్వేత మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement