Thursday, March 28, 2024

Breaking: ఎన్‌టీపీసీ ప్లాంట్ లో ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

ఎన్‌టీపీసీ (ప్ర‌భ న్యూస్‌) : తెలంగాణ రాష్ట్రంలోని రామగుండం థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఇవ్వాల ( సోమవారం) సాయంత్రం ప్ర‌మాదం జ‌రిగింది. స్టేజ్ 2 స్లరి పంప్ హౌస్ లో విద్యుత్ ఫ్లాష్ ఓవర్ కావడంతో శంకరయ్య, మహేష్ అనే కాంట్రాక్ట్ కార్మికులకు గాయాలయ్యాయి. వీరిని ప్రథమ చికిత్స కోసం ఎన్‌టీపీసీ పర్మినెంట్ టౌన్‌షిప్‌లోని ధన్వంతరి హాస్పిటల్ కు తరలించారు. క‌గా, మెరుగైన వైద్యం కోసం వారిని హైదరాబాద్ కు తీసుకెళ్లిన‌ట్టు డాక్ట‌ర్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement