Friday, May 3, 2024

Big Breaking | బైకును ఢీకొట్టిన కారు.. ముగ్గురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు మృతి

ఇబ్రహీంపట్నం, (ప్రభ న్యూస్): అతివేగంతో కారును బైక్ ఢీకొనడంతో ముగ్గురు విద్యార్థులు చ‌నిపోయిన‌ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపిన వివ‌రాల‌ ప్రకారం.. కందుకూరు మండల కేంద్రానికి చెందిన ఎస్ నారాయణ రెడ్డి, లంగర్ హౌస్ డిఫెన్స్ కాలనీకి చెందిన ఇ. భాను ప్రసాద్, హస్తినాపూర్ కు చెందిన కె నవీన్ ముగ్గురు విద్యార్థులు ఇబ్రహీంపట్నం సమీపంలోని భారత్ ఇంజనీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు.

వీరు ముగ్గురు ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని రాయపోలు నుంచి ఇబ్రహీంపట్నం వైపు టీఎస్08జీపీ0552 నంబరు గల బైకుపై వస్తున్నారు. ఇబ్రహీంపట్నం వైపు నుంచి రాయపోలు వైపు వెళ్తున్న ఏపీ28బిఎస్0010 నెంబర్ గల కారు జనార్ష దాటిన తర్వాత హెచ్పి పెట్రోల్ పంప్ వద్దకు రాగానే వేగంగా ఢీకొన్నాయి. కారు బైకు ఓవర్ స్పీడ్ గా ఉండడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులు తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందారు. కారులో రెండు ఏయిర్ బెలున్స్ ఓపెన్ కావడంతో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదని పోలీసులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement