Monday, May 6, 2024

Covid-19: దేశంలో భారీగా పెరిగిన కరోనా.. కొత్తగా 9,195 కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి.  రోజువారీ క‌రోనా కేసులు సంఖ్య పెరిగిపోతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో 9,195 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. కొవిడ్​తో 302 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న 7,347 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం దేశంలో 77,002 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు నమోదైన కేసుల సంఖ్య 3,48,08,886కి చేరింది. ఇందులో 3,42,51,292 మంది కోలుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 143.15 కోట్ల కోవిడ్ డోసుల వ్యాక్సిన్లు అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement