Wednesday, May 1, 2024

గుడిసెలోకి దూసుకెళ్లిన లారీ.. 8 మంది మృతి

గుజరాత్ లోని​ అమ్రేలి ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి ఓ ట్రక్కు దూసికెళ్లింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. సోమవారం తెల్లవారుజామున 2.30 ప్రాంతంలో బధడా గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు.  క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ట్రక్కుపై డ్రైవర్​ నియంత్రణ కోల్పోయి.. 10 మంది నిద్రిస్తున్న రోడ్డు పక్కనే ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement