Monday, April 29, 2024

బెంగాల్ దంగల్.. ఏడో దఫా పోలింగ్ షురూ

బెంగాల్ లో ఏడో విడత పోలింగ్ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సిట్టింగ్​ స్థానమైన భవానీపుర్​ సహా 34 నియోజకవర్గాలకు నేడు ఓటింగ్ జరగనుంది. మొత్తం 284 మంది అభ్యర్థులు ఈ దశ బరిలో ఉన్నారు.తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు.

గత విడతల పోలింగ్​లో తలెత్తిన ఉద్రిక్తతల దృష్ట్యా.. ఈసారి భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 796 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించినట్లు చెప్పింది. ఓటర్లు కొవిడ్-19 నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది.

​ఏడో దఫా ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement