Sunday, May 5, 2024

ఇండియాలో కొత్తగా 547 కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి పూర్తిగా అదుపులోకి వ‌చ్చింది. క‌రోనా కేసులు వేల సంఖ్య నుంచి వంద‌ల సంఖ్య‌లోకి వ‌చ్చాయి. తాజాగా.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 547 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, 2020 ఏప్రిల్‌ తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజా కేసులతో దేశంలో వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 4,46,66,924కి చేరింది. ప్రస్తుతం దేశంలో 9,496 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు 4,41,26,924 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో వైరస్‌ కారణంగా ఒకరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,532కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement