Monday, April 29, 2024

24 గంటల్లో 5 ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో అయిదుగురు iఉగ్రవాదులను అంతమొందించినట్లు భద్రతాబలగాలు వెల్లడించాయి. కుల్గామ్ జిల్లా జోడార్ ఏరియాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాబలగాలు కాల్చిచంపాయి. చనిపోయిన ఉగ్రవాదులు ఇద్దరూ లష్కరే-ఇ-తోయిబాకు చెందిన వారని అధికారులు తెలిపారు. ఇక పుల్వామా జిల్లా పుచల్ ఏరియాలో కశ్మీర్ జోన్ పోలీసులు మరో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. సైన్యం, స్థానిక పోలీసులు కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా.. టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరిపాయి.

కాగా, బుధవారం ఉదయం హంద్వారాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాహిదిన్‌కు చెందిన టాప్ కమాండర్ మెహ్రజుద్దీన్ హల్వాయ్ అలియాస్ ఉబైద్‌ను భద్రతా బలగాలు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. గత 24 గంటల్లో మొత్తం ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు కాల్చి చంపాయి. భద్రతా బలగాలకు ఇదో పెద్ద సక్సెస్ అని ఐజీపీ విజయ్ కుమార్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: షర్మిల పార్టీకి కాంగ్రెస్ ఎంపీ మద్దతు!

Advertisement

తాజా వార్తలు

Advertisement