Monday, April 29, 2024

Breaking: న‌డి రోడ్డుపై నాలుగు నెల‌ల పిండం..

సికింద్రాబాద్ అల్వాల్ అంజ‌నాపురి కాల‌నీలో అమానుష ఘ‌ట‌న జరిగింది. నాలుగు నెల‌ల పిండాన్ని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు రోడ్డుపై ప‌డేశారు. స్థానికుల స‌మాచారంతో పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని ఆ పిండాన్ని గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ పిండాన్ని ఎవ‌రు వ‌దిలేశారు అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. వారి ఆచూకీ క‌నుగొనేందుకు అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల‌ను పోలీసులు ప‌రిశీలిస్తున్నారు. శిశువును చుట్టుపక్కల వాళ్లు పడేశారా? లేకపోతే బయట నుంచి ఎవరైనా వచ్చి పడేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement