Friday, May 3, 2024

Flash: లారీని ఢీ కొట్టిన బొలెరో .. నలుగురికి తీవ్రగాయాలు

బొలెరో వాహనం లారి ని వెనుకనుండి ఢీకొట్టిన ప్రమాదంలో నాలుగురు గాయపడిన సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి శాంతినగర్ శివారులో పెద్దపెల్లి బస్టాండ్ వైపు వస్తున్న లారీని బొలెరో వాహనం వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స జరుపుతున్నారు. గాయపడిన వారిలో పెద్ద పల్లి మున్సిపల్ రెండో వార్డు కౌన్సిలర్ హనుమంతు, లక్ష్మణ్ తో పాటు మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. సమాచారం అందుకున్న పెద్దపల్లి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement