Saturday, May 4, 2024

Earthquake: అండమాన్ దీవుల్లో భూకంపం

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో మరోసారి స్వల్ప భూకంపం వచ్చింది. డిగ్లిపూర్‌లో శనివారం రాత్రి 11.04 గంటలకు భూకంపం వచ్చిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. దీని తీవ్రత 4.1గా నమోదైందని వెల్లడించింది. డిగ్లిపూర్‌కు 3 కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రం ఉన్నదని పేర్కొంది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వివరించింది. రాత్రి సమయంలో భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement