Sunday, April 28, 2024

అగ్నిపథ్​పై ఫేక్​ న్యూస్​ ప్రచారం.. 35 వాట్సాప్​ గ్రూపులపై కేంద్రం నిషేధం

అగ్నిపథ్ మిలటరీ రిక్రూట్‌మెంట్ పథకం గురించి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న 35 వాట్సాప్ గ్రూపులను ప్రభుత్వం ఆదివారం నిషేధించినట్లు అధికారులు తెలిపారు. ఈ పథకం ప్రకటించినప్పటి నుండి దేశంలోని వివిధ ప్రాంతాలలో వ్యతిరేకంగా హింసాత్మక నిరసనల మధ్య ఈ చర్య తీసుకున్నట్టు తెలిపారు.  అయితే, ఈ గ్రూపుల ద్వారా సమాచారం, వాటి నిర్వాహకులపై ఏదైనా చర్యతీసుకున్నారా అనేది మాత్రం ఇంకా తెలియలేదు.  

దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నప్పటికీ ‘అగ్నిపథ్’ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌ను వెనక్కి తీసుకోబోమని  సైన్యానికి చెందిన త్రివిధ దళాల అధికారులు ఆదివారం తెలిపారు. అంతేకాకుండా కొత్త విధానంలో రిక్రూట్​మెంట్​ చేసుకునే షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement