Sunday, May 19, 2024

FLASH: 260 కిలోల హెరాయిన్​ పట్టివేత.. విలువ ఎంతో తెలుసా?

గుజరాత్​లో మరోమారు భారీగా డ్రగ్స్​ పట్టుబడ్డాయి. గుజరాత్​ యాంటీ టెర్రరిస్ట్​ స్క్వాడ్​(ఏటీఎస్​), డైరెక్టరేట్​ ఆఫ్​ రెవెన్యూ ఇంటెలిజెన్స్​(డీఆర్​ఐ) సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్​లో 260 కిలోల హెరాయిన్​ను పట్టుకున్నారు. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.1,300 కోట్లు ఉంటుందని తెలిపారు. కచ్​ జిల్లాలోని కండ్లా పోర్టుకు సమీపంలో ఉన్న కంటెయినర్​ స్టేషన్​లో తనిఖీలు నిర్వహించగా ఓ కంటెయినర్​లో భారీగా డ్రగ్స్​ వెలుగు చూసినట్లు అధికారులు తెలిపారు. డ్రగ్స్‌ను కంటైనర్లలో భారత్‌కు తరలిస్తున్నట్లు గుజరాత్ ఏటీఎస్‌కు సమాచారం అందింది. పక్కా సమాచారం మేరకు ATS మరియు DRI సంయుక్తంగా ఒక కంటైనర్ నుండి ఈ డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement