Friday, May 10, 2024

Flash: డీసీఎంను ఢీకొట్టిన కారు.. ఇద్దరు దుర్మరణం

పెద్దపల్లిలోని పెద్దకలువ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దకలువ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ప్రమాదం ధాటికి కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. పెద్దకల్వల శివారులో డిసిఎం సాంకేతిక లోపంతో నిలిచిపోగా మధ్యప్రదేశ్ నుండి హైదరాబాద్ వెళ్తున్న స్కార్పియో వెనుక నుండి ఢీకొంది. ఈ ప్రమాదంలో మధ్య ప్రదేశ్ కు చెందిన చైత్ర ముఖి (25), హులాస్ రామ్ (40) అక్కడికక్కడే మృతి చెందారు. స్కార్పియో లో ప్రయాణిస్తున్న హేమేంద్ర సహరి, రాహుల్ సత్పూరి, దుక్రాం తికం, నాగేంద్ర సహారి తో పాటు డ్రైవర్ కరణ్ గాయపడ్డారు. గాయపడ్డ వారిని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స జరుపుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement