Wednesday, May 1, 2024

Flash: బోలేరో ట్రాలీ వాహనం పల్టీ.. ఇద్దరు మృతి, 20 మందికి గాయాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగుడెం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెగళ్ళ వద్ద బోలేరో ట్రాలీ వాహనం పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందగా.. మరో ఇరవై మందికి గాయాలు అయ్యాయి. మృతులు స్వర్ణలత,సమ్మక్కగా గుర్తించారు. మర్కొడు మండలం లోద్దిగుడెంలో ఓ గుడికి  వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement