Monday, April 29, 2024

దేశంలో కొత్త‌గా 1,938 క‌రోనా కేసులు

వ‌రుస‌గా మూడోరోజు క‌రోనా బారిన ప‌డుతోన్న వారి సంఖ్య పెరిగింది. నిన్న 17వంద‌ల కేసులు న‌మోద‌య్యాయి. కాగా నేడు 19వంద‌ల కేసులు న‌మోద‌య్యాయి. దేశంలో కొత్తగా 1938 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,14,687కు చేరాయి. ఇందులో 4,24,75,588 మంది కోలుకోగా, 5,16,672 మంది బాధితులు మరణించారు. మరో 22,427 మంది చికిత్స పొందుతున్నారు.గత 24 గంటల్లో 67 మంది కరోనాకు బలవగా, 2531 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.05 శాతం మాత్రమేనని, రోజువారీ పాజిటివిటీ రేటు 0.29 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు 182.23 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement