Sunday, April 28, 2024

బిహార్‌లో పిడుగుపాటుకు.. 17 మంది మృతి


బీహార్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పిడుగులు భయాందోళనలు కలిగించాయి. పిడుగులు పడి 17 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలోని భాగల్పూర్ జిల్లాలో ఆరుగురు, వైశాలి జిల్లాలో ముగ్గురు, బంకా, ఖగారియా, ముంగేర్, కతిహార్, మాధేపురా, సహర్సా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున పిడుగుపాటుకు ప్రాణాలు వదిలారు. శనివారం రాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో భారీవర్షాలు కురవడంతో 17 మంది మరణాలు సంభవించాయి. ఆయా ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement