Friday, May 3, 2024

Breaking: తెలంగాణలో కొత్తగా 13 రెవెన్యూ మండలాలు.. ఉత్తర్వులు జారీన ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రంలో కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నుంచి ఇవ్వాల (సోమవారం) రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. 13 రెవెన్యూ మండలాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో ఉంది. కాగా, కొత్త మండలాల్లో జగిత్యాల జిల్లాలో ఎండపల్లి, భీమారం రెవెన్యూ మండలాలుగా ప్రకటించింది ప్రభుత్వం. సంగారెడ్డి జిల్లాలో నిజాంపేట, నల్గొండ జిల్లాలో గట్టుప్పల్​, మహబూబ్​నగర్​ జిల్లాలో సీరోలు, ఇనుగుర్తి, సిద్దిపేట జిల్లాలో అక్బర్​పేట్​, భూంపల్లి, కుకునూర్​పల్లి ఉన్నాయి.

ఇక.. కామారెడ్డి జిల్లాలో డోంగ్లి, మహబూబ్​నగర్​ జిల్లాలో కౌకుంట్ల, నిజామాబాద్​ జిల్లాలో ఆలూర్​, డొంకేశ్వర్​, సాలూరాలను మండలాలుగా ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఆయా మండలాల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement