Thursday, May 2, 2024

మేఘాలయలో కాంగ్రెస్‌కు షాక్.. 12 మంది ఎమ్మెల్యేలు జంప్

మేఘాలయలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలలో 12 మంది తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరారు. వీరిలో మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా కూడా ఉన్నారు.

మేఘాలయ అసెంబ్లీలో మొత్తం 60 సీట్లు ఉన్నాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 21 స్థానాల్లో విజయం సాధించింది. ప్రస్తుతం ఆ పార్టీకి 17 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. వీరిలో 12 మంది ఎమ్మెల్యేలు రాత్రికి రాత్రే టీఎంసీలో చేరారు. దీంతో అసెంబ్లీలో ఆ పార్టీ ప్రతిపక్షంగా అవతరించింది.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున టీఎంసీలో చేరడంతో అప్రమత్తమైన ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ మనీష్ చత్రత్ ఈ రోజు మేఘాలయ వెళ్లనున్నారు. నిజానికి ఆయన నేడు గుజరాత్ వెళ్లి కాంగ్రెస్ దివంగత నేత అహ్మద్ పటేల్ మొదటి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అయితే, మేఘాలయలో జరిగిన తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement