Monday, May 6, 2024

Flahs: సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది సజీవదహనం

సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సికింద్రాబాద్‌లోని బోయిగూడలో ఉన్న టింబర్‌ డిపోలో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున్న అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 11 మంది సజీవ దహనం అయ్యారు. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అదుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎనిమిది ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతులు బిట్టు, సికిందర్, దామోదర్, సత్యేందర్, చింటు, దినేష్, రాజేష్, రాజు, దీపక్, పంకజ్ లుగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement