Sunday, May 5, 2024

బిహార్ లో పిడుగుపడి… 11 మంది మృతి

బిహార్‌ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పిడుగులు పడడంతో పలువురు చనిపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో పిడుగుపాటుకు 11 మంది మృత్యువాతపడ్డారు. పూర్నియా జిల్లాలో నలుగురు, సుపాల్‌లో ముగ్గురు, అరారియాలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే బాధిత కుటుంబాలకు బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రతికూల వాతావరణంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అధికారులు జారీ చేసే మార్గదర్శకాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement