Sunday, May 5, 2024

ఈజిప్ట్ లో ఘోరం.. రైలు ప్రమాదంలో 11 మంది మృతి

ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. తాజాగా రాజధాని కైరో నుంచి బయలుదేరిన ఓ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా, మరో 98 మంది గాయపడ్డారు. రాజధాని కైరో నుంచి మన్సోరా వెళ్తున్న రైలు టోక్ అనే చిన్న పట్టణం వద్ద పట్టాలు తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక బృందాలు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాయి. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement