Wednesday, May 1, 2024

Flash: వేడుకలో షార్ట్‌సర్క్యూట్‌.. 10 మంది సజీవదహనం

తమిళనాడులోని తంజావూరులో ఘోర ప్రమాదం జరిగింది. కలిమేడులో అప్పర్ ఆలయ రథోత్సవం సందర్భంగా విద్యుదాఘాతంతో చిన్నారులతో సహా 10 మంది మృతి చెందారు. ఈ ఘటనలో మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. అప్పర్‌ గురుపూజై (అయ్యప్పస్వామి పండుగ) సందర్భంగా స్వామివారికి రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు రథాన్ని వీధులగుండా గుడికి తీసుకొస్తుండగా ప్రమాదవశాత్తు అది హైటెన్షన్‌ వైర్లకు తగిలింది. షార్ట్‌సర్క్యూట్‌ కావడంతో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. దీంతో 10 మంది కాలి బూడిదయ్యారు. వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement