Tuesday, May 7, 2024

వైఎస్సార్ ను కించపరిస్తే ఖబడ్దార్.. టీఆర్ఎస్ పార్టీకి షర్మిల వార్నింగ్

దివంగత మాజీ సీఎం వైఎస్సార్ పై టీఆర్ఎస్ మంత్రులు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఆయన కూతురు వైఎస్ షర్మిల స్పందించారు. సీఎం కేసీఆర్ సహా, టీఆర్ఎస్ నేతలు మహానేత వైఎస్సార్ ను కించపరిచేలా మాట్లాడితే ఖబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. వైఎస్సార్ గురించి మాట్లాడే అర్హత వారికి లేదన్నారు. వైఎస్సార్ గురించి, ఆయన గొప్పదనం గురించి తెలుగు ప్రజలందరికీ తెలుసని చెప్పారు. ఆరోగ్య శ్రీ సృష్టికర్త వైఎస్సారేనని, అది మంచి పథకం కాబట్టే టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని తొలగించలేదని షర్మిల పేర్కొన్నారు.

“మంచి పథకాన్ని తొలగించే ధైర్యం మీకు లేదు. వైఎస్సార్ గురించి మాట్లాడే స్థాయి మీకు లేదు. మరోసారి చెబుతున్నా… వైఎస్సార్ మహానేత, మనసున్న నేత. మీలాగా కాదు… వైఎస్సార్ నిజమైన ప్రజల నేత. మరోసారి వైఎస్సార్ ను కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదు. కేసీఆర్, టీఆర్ఎస్… ఖబడ్దార్! వైఎస్సార్ ను అవమానించేలా మాట్లాడితే లక్షల్లో ఉన్న ఆయన అభిమానులు తిరగబడతారు” అని షర్మిల హెచ్చరించారు.

ఇదీ చదవండి: వైఎస్ న‌ర‌రూప రాక్ష‌సుడు.. ప్ర‌జ‌ల‌కు గుక్కెడు నీళ్లు ఇవ్వ‌లేదు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

Advertisement

తాజా వార్తలు

Advertisement