Friday, May 3, 2024

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఉద్రిక్తత

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. 7వ వార్డు వద్ద స్వతంత్ర అభ్యర్థి ఉషారాణి భర్త నాగేశ్వరరావుపై జనసేన కార్యకర్తలు దాడి చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. అటు గుంటూరులోని సంజీవనగర్ పోలింగ్ కేంద్రం వద్ద గుర్తింపు లేని ఓటర్లను వైసీపీ నేతలు తీసుకొస్తున్నారని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. టీడీపీ ఏజెంట్లను కూడా బయటకు పంపాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. అటు చిత్తూరు జిల్లా తిరుపతిలోని 14వ వార్డు మహాత్మాగాంధీ స్కూలు వద్ద వైసీపీ శ్రేణులను బూత్‌లోకి అనుమతించి తమను పంపించడం లేదని టీడీపీ నేతలు నిరసనకు దిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement