Saturday, May 18, 2024

ఏపీలో వాలంటీర్లకు హెచ్చరికలు

అమరావతి: ఏపీలో మున్పిపల్ ఎన్నికల్లో వాలంటీర్ల జోక్యం చట్టవిరుద్ధమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ అన్నారు. వాలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటింగ్‌ను ప్రభావితం చేసేలా వాలంటీర్లు లబ్ధిదారులతో మాట్లాడొద్దన్నారు. వాలంటీర్లకు సంబంధించిన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అటు వాలంటీర్లు తమ ఫోన్లను ఎన్నికల అధికారులకు అప్పగించాలని హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

వాలంటీర్లు ఓటర్లను ప్రలోభపెడితే చట్టప్రకారం శిక్షార్హులవుతారని నిమ్మగడ్డ హెచ్చరించారు. తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణం, గుంటూరుల్లో డబ్బుల పంపిణీపై నిఘా పెట్టామని.. ఎవరైనా డబ్బులు పంపిణీ చేస్తే కమిషనర్ కాల్ సెంటర్‌కు గానీ, జిల్లా కలెక్టర్‌కు గానీ ఫిర్యాదులు చేయాలని నిమ్మగడ్డ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement