Friday, May 10, 2024

Breking | ఉత్కంఠ‌పోరులో విండీస్‌దే గెలుపు.. భార‌త్‌పై నాలుగు ప‌రుగుల విజ‌యం

విండీస్ టూర్‌లో భాగంగా ఇవ్వాల (గురువారం) రాత్రి జ‌రిగిన టీ20 మ్యాచ్ జ‌రిగింది. ట్రినిడాడ్‌లోని బ్రియ‌న్ లారా స్టేడియంలో జ‌రిగిన తొలి టీ20లో భార‌త్ పై క‌రీబియ‌న్ జ‌ట్టు గెలుపొందింది. చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ కొన‌సాగ‌గా.. నాలుగు ప‌రుగుల తేడాతో విండీస్ విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జ‌ట్టు నిర్ణీత ఓవ‌ర్ల‌లో 149 ప‌రుగులు చేసింది. కాగా, భార‌త్ టార్గెట్ 150 ప‌రుగులుగా ఉంది. అయితే.. టీమిండియా టాప్ బ్యాట‌ర్లు పెద్ద‌గా రాణించ‌లేదు. ఒక్క సూర్య‌కుమార్ యాద‌వ్ (21), తిల‌క్‌వ‌ర్మ‌(39) మిన‌హా మిగ‌తా వారు పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. దీంతో చివ‌రి వ‌ర‌కు ఆట నువ్వా నేనా అన్న‌ట్టుగా కొన‌సాగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement