Thursday, May 2, 2024

Wankhede : వాంఖ‌డే స్టేడియం@50

దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని వాంఖడే స్టేడియాన్ని నిర్మించి 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘నాకు పదేళ్లు ఉన్నప్పుడు మొదటిసారి వాంఖడే స్టేడియాన్ని చూశా.

కానీ, ఐదేళ్ల తర్వాత ఇదే స్టేడియంలో ముంబై తరఫున అరంగేట్రం చేస్తానని అనుకోలేదు. 15 ఏళ్లప్పుడు ఇదే స్టేడియంలో మొదటిసారి గుజరాత్పై ఆడా. 2011లో నా దేశం కోసం వరల్డ్ కప్ను గెలవడం నా కెరీర్లో మరిచిపోలేని క్షణాలు. ఇక్కడే నా 200వ టెస్ట్ మ్యాచ్నూ ఆడా. ఇదే మైదానంలో నాకెంతో ఇష్టమైన ఆటకు వీడ్కోలు పలికా’ అని సచిన్ తన ట్వీట్లో పేర్కొన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement