Saturday, May 11, 2024

IPL | బెంగళూరు చేరుకున్న విరాట్ కోహ్లీ

టీమిండియా బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ లండన్ నుంచి బెంగళూరు చేరుకున్నాడు. ఐపీఎల్ 2024 ప్రారంభానికి మూడు రోజుల ముందు కోహ్లీ బెంగళూరు చేరుకున్నాడు. దీంతో ఆర్సీబీ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. విరాట్ తన భార్య డెలివరీ కారణంగా రెండు నెలలుగా లండన్‌లోనే ఉన్నాడు, అందుకే అతను ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. ఇదిలా ఉంటే, IPL 2024 మొదటి మ్యాచ్ మార్చి 22న ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్ సీఎస్‌కే vs ఆర్సీబీ జట్ల మధ్య జరుగుతుంది.

ఆర్‌సిబి జట్టు: ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, రజత్ పాటీదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, కామెరాన్ గ్రీన్, మనోజ్ భాండాగే, సుయాస్ ప్రభుదేశాయ్, మాయాన్సెక్, లాకీ ఫెర్గూసన్, యష్ దయాల్, మయాన్స్‌క్ టాప్లీ, స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, రాజన్ కుమార్, హిమాన్షు శర్మ, విజయ్ కుమార్ వైషాక్, అల్జారీ జోసెఫ్, టామ్ కర్రాన్, సౌరవ్ చౌహాన్

Advertisement

తాజా వార్తలు

Advertisement